జమ్మూ కాశ్మీర్ లో గత కొన్ని రోజులుగా భారత బలగాలు వరుస ఆపరేషన్ లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సిఆర్‌పిఎఫ్ వ్యాలీ క్యూట్ (క్విక్ యాక్షన్ టీం), 115 బిఎన్, 28 బిఎన్ సిఆర్‌పిఎఫ్, జమ్మూ పోలీసుల సంయుక్త దళాలు అక్కడ ప్రారంభించిన కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ లో శ్రీనగర్‌లోని జాదిబాల్‌లో ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. 

 

వారు స్థానిక ఉగ్రవాదులు కాబట్టి, 3 మంది ఉగ్రవాదులను లొంగిపోవాలని విజ్ఞప్తి చేయమని తాము అక్కడ ఉన్న కొందరిని అడిగామని కాని వారు వినలేదని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. హ్యాండ్ గ్రెనేడ్ విసిరారని చెప్పారు. ఆ తర్వాత ఫైరింగ్ మొదలైందని జమ్మూ కాశ్మీర్ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: