కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు ఢిల్లీ వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యేంద్ర జైన్ కి కరోనా సోకింది. ఆయన ప్రాణాలకు ముప్పు ఉంది అనే వార్తలు కూడా వచ్చాయి. ఈ తరుణంలో ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకుని బయటపడ్డారని తెలుస్తుంది. 

 

ప్లాస్మా చికిత్స తరువాత ఆయన ఆరోగ్యం కాస్త మెరుగు పడింది అని వైద్యులు వివరించారు. ఆయనకు జ్వరం తగ్గిందని, శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు కూడా మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన్ను రేపు జనరల్ వార్డుకు తరలించే అవకాశం ఉందని చెప్పారు. ఆయన పరిస్థితి విషమంగా మారడంతో ప్లాస్మా చికిత్స చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: