తెలంగాణాలో హరిత హారం విషయంలో రాష్ట్ర సర్కార్ దూకుడు ఏ విధంగా ఉంది అనే విషయం అందరికి తెలిసిందే. హరిత హారం విషయంలో సిఎం కేసీఆర్ నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ సీరియస్ గా ఉన్నారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతూ వస్తున్నా సరే హరిత హారం విషయంలో మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు తెలంగాణా సర్కార్. 

 

ఇక ఇదిలా ఉంటే హరిత హారంతో ఇప్పుడు అక్కడి జిల్లాలు పచ్చని తోరణంతో ఉన్నాయి. కరీం నగర్ జిల్లాలో  వెయ్యి ఎకరాలకు పైగా అటవీ భూమి అభివృద్ధి చెందింది అంటే హరిత హారం విషయంలో రాష్ట్ర సర్కార్ ఆలోచన ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: