ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఆయన ఢిల్లీ పర్యటనకు సిద్దమైనట్టు తెలుస్తుంది. ఈ నెల 26,27 తేదీల్లో ఆయన ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆయన పర్యటన కరోనా తీవ్రత ఉంటే వాయిదా పడే అవకాశం ఉంది. 

 

ఇక ఆయన ఢిల్లీ వెళ్లి హోం మంత్రి అమిత్ షా ప్రధాని నరేంద్ర మోడీ తో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక లేఖ కూడా రాసి కేంద్ర బలగాలతో తనకు రక్షణ కల్పించాలి అని కోరిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: