ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన ఒక ప్రకటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే.  పాకిస్థాన్ జట్టు    పేసర్ ఇర్ఫాన్ కు కొత్త  తలనొప్పి తెచ్చిపెట్టింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన ప్రకటన. ఇర్ఫాన్  అనే క్రికెటర్ చనిపోయాడని... అతడు మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ఓ ప్రకటనలో పేర్కొంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. 

 

 దీంతో పాకిస్థాన్ జట్టు పేసర్ ఇర్ఫాన్ చనిపోయాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అభిమానులు ఏకంగా సంతాపాలు కూడా తెలియజేశారు. అయితే తాజాగా దీనిపై స్పందించారు ఇర్ఫాన్. తను చనిపోలేదని తనకు ఎటువంటి ఆక్సిడెంట్స్ జరగలేదని అవన్నీ ఒట్టి పుకార్లే అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇలాంటి పుకార్లు కారణంగా తన కుటుంబం ఎంతో కలతచెందింది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: