తనకు ప్రాణ హాని ఉందని వైసీపీ ఎంపీ రఘురామా కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న తరుణంలో తాజాగా మంత్రి శ్రీరంగ నాథ రాజు స్పందించారు. రఘు ని ప్రాణంగా చూసుకుంటామని ఆయన అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి భద్రత కావాలన్నా ప్రభుత్వం కల్పిస్తుందని ఆయన స్పష్టం చేసారు. రఘురామకృష్ణంరాజు తమ పార్లమెంట్ సభ్యులని ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా గౌరవంగా చూసుకుంటామన్నారు. ఆయనకు పూర్తి భద్రత కల్పిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

 

ఇదేమీ ఫ్యాక్షన్ ఏరియా కాదన్న ఆయన... ఆయన ఎవరికీ భయపడనవసరం లేదన్నారు. 15 లక్షల మందికి ప్రజాప్రతినిధి ఆయన పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలలో అక్రమాలు జరిగాయని తానే మొదట బయటపెట్టినట్లు ఈ సందర్భంగా మంత్రి వివరించారు. నియోజకవర్గానికి వస్తే ప్రోటోకాల్ ప్రకారం రఘురామకృష్ణంరాజుకు సహకరిస్తామన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: