సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రజల డబ్బును దోచుకునే మార్గాల కోసం ఎదురు చూస్తారు అంటూ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. అతను ఇసుక, భూమి, గాలి & నీటిని కూడా విడిచిపెట్టలేదన్నారు. అతను దేవుని స్వంత సంపదను కాజేశాడు అంటూ ఆయన మండిపడ్డారు. అతను బిపిఎల్ మరియు ఎల్ఐజి కుటుంబాల చికిత్స కోసం కేటాయించిన డబ్బును కూడా తీసుకున్నాడని మండిపడ్డారు. 

 

ఇక మరో ట్వీట్ లో... నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్న ఒక ఎమ్మెల్యేని, బాబు గారి దూత కలిసి పార్టీని వదిలి వెళ్లొద్దని ప్రాధేయపడ్డాడట. తక్షణం 5 కోట్లు సర్ధారట. ఇంకో పదేళ్లు పవర్ లేకపోయినా దేనికీ ‘లోటు’ లేకుండా పార్టీని నడిపిస్తారని భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోందని... ఖజానా దోచినోడికి ఇదో లెక్కా అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: