నందమూరి బాలకృష్ణ సారధ్యంలో స్థాపించిన బసవ తారకం ఇండో క్యాన్సర్ ఆస్పత్రి స్థాపించి నేటికి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు బాలకృష్ణ కు శుభాకాంక్షలు చెప్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. 

 

విజయవంతంగా పేద సేవలో 20 ఏళ్ళు పూర్తి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు అభినందనలని ఆయన ట్వీట్ చేసారు. బాలకృష్ణ గారు తన ఆదర్శప్రాయమైన అంకితభావంతో దివంగత శ్రీ ఎన్.టి.రామారావు గారు కలను నెరవేరుస్తున్నారని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు. భవిష్యత్ ప్రయత్నాలన్నింటికీ నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక టీడీపీ నేతలు కూడా ట్వీట్ లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: