కరోనాతో తమిళనాడు రాష్ట్రం పూర్తిగా మునిగిపోయిందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అక్కడ నిన్న ఒక్క రోజే ఏకంగా 2700 కేసులు వచ్చాయి. దీనితో  అక్కడి ప్రజలలో కూడా భయం మొదలయింది. కేసుల సంఖ్య 62 వేలు దాటింది. ఇక లక్ష కేసులు అవడానికి ఆ రాష్ట్రం ఎక్కువ రోజులు తీసుకునే అవకాశం లేదని అంటున్నారు. 

 

అక్కడ లక్ష కేసులు కేవలం మరో 20 రోజుల్లో నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ లో కూడా పరిస్థితి దాదాపుగా అదే విధంగా ఉంది. అక్కడ ఏ మాత్రం కేసులు తగ్గడం లేదు. మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే 3700 కేసులు వచ్చాయి.  ఇక ఎక్కువగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలు ఈ మూడే.

మరింత సమాచారం తెలుసుకోండి: