దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనితో ఇప్పుడు ప్రజలు బయటకు రావాలి అంటే భయపడుతున్నారు. ఇక ఈ తరుణంలోనే పలు పరీక్షలను కూడా రద్దు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక కరోనా నేపధ్యంలో పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న సీబీఎస్‌ఈ, జేఈఈ, నీట్‌ పరీక్షలను కేంద్ర మానవ వనరుల శాఖ రద్దు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. 

 

దీనిపై నేడు ప్రకటన వచ్చే అవకాశాలూన్నాయి. జూలై 1 నుంచి 15 వరకు నిర్వహించనున్న సీబీఎస్‌ఈ పరీక్షలను రద్దు చెయ్యాలి అంటూ ఇటీవల కొందరు తల్లి తండ్రులు సుప్రీం కోర్ట్ కి వెళ్ళారు. రాష్ట్రాల్లో ఇప్పటికే పలు పరీక్షలను రద్దు చేసారు. ఆ విధంగానే వీటిని కూడా రద్దు చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: