భారత్ చైనా సరిహద్దులకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రెండు దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. ఇప్పటికే ఆయన పర్యటనపై కేంద్ర రక్షణ శాఖతో పాటుగా ఆర్మీ ఉన్నతాధికారులకు కూడా సమాచారం వెళ్ళింది అని సమాచారం. 

 

ఈ నేపధ్యంలో ఆయన రెండు మూడు రోజుల్లో పర్యటనకు వెళ్ళే అంశంపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని  ఆర్మీ వర్గాలు అంటున్నాయి. ఇక రెండు దేశాల సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు వెళ్తే ఏ విధంగా పరిస్థితులు ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: