భారత్ లో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి దేశంలో. గత 24 గంటల్లో దాదాపు 15 వేల కేసులు నమోదు అయ్యాయి అని కేంద్రం వెల్లడించింది. 

 

గత 24 గంటల్లో భారతదేశంలో 312 మరణాలు సంభవించాయి అని కేంద్రం పేర్కొంది. అదే విధంగా 14933 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. భారతదేశంలో పాజిటివ్ కేసులు 440215 గా ఉన్నాయని తెలిపింది. వీటిలో 178014 క్రియాశీల కేసులు ఉన్నాయి. 248190 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 14011 మంది కరోనా కారణంగా మరణించారు అని  ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: