ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ కి కూడా వెళ్ళింది. తనకు ప్రాణ హాని ఉందని తన ప్రాణాలకు రక్షణ కల్పించాలి అని ఆయన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కు ఒక లేఖ రాసారు. కేంద్ర బలగాలాతో రక్షణ కల్పించాలి అని కోరారు. 

 

దీనిపై లోక్ సభ స్పీకర్ కార్యాలయం నుంచి స్పందన వచ్చింది. రఘురామ కృష్ణంరాజు రాసిన లేఖను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా హోంశాఖకు పంపించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అయితే ఆయనకు ఏ ఇబ్బంది లేదు అని స్వేచ్చగా నియోజకవర్గానికి రావచ్చు అని మంత్రి శ్రీరంగ నాథ రాజు పేర్కొన్నారు. మరి కేంద్రం ఎం చేస్తుంది అనేది చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: