వ్యవస్థల్లో ఉన్న తన మనుషుల ద్వారా చంద్రబాబు నాయుడు ఏపీ సర్కార్ మీద కుట్ర చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. పార్క్ హయత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేష్ ని సుజనా చౌదరి అదే విధంగా కామినేని శ్రీనివాస్ కలవడంపై ఆయన తన మార్క్ లో తీవ్ర స్థాయి విమర్శలు చేసారు. 

 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెంటనే పదవి నుంచి తప్పుకోవాలి అని ఆయన డిమాండ్ చేసారు. నిమ్మగడ్డ రమేష్ తో కలిసి కుట్రలు చేస్తున్నారని  ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంపై కుట్రలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ఇలాంటివి చంద్రబాబు కి వెన్నతో పెట్టిన విద్య అని... ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది కచ్చితంగా చంద్రబాబు డైరెక్షన్ లో జరిగిన భేటీ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: