ఒక్క ఛాన్స్ తీసుకుని రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. రాష్ట్రంలో ఏడాదికాలంగా ఇనుప సంకెళ్ల పాలన నడుస్తోందని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలో సాక్ష్యాధారాలతో ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఈ సందర్భంగా తీవ్ర ఆరోపణలు చేసారు. 

 

టీడీపీ నాయకులపై అసభ్య పదజాలంతో పోస్టింగులు పెడుతున్న వారిని వదిలేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని జగన్ పరిపాలిస్తున్నారో, రాక్షసులు పాలిస్తున్నారో అర్థంకావడం లేదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడం ఎవరి తరం కాదన్నారు ఆయన. రాజధాని మార్చడమంటే.. రంగులు మార్చినంత ఈజీ కాదని హెచ్చరించారు. పైకి ప్రత్యేక హోదా లోపల కేసుల మాఫీ కోసం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: