టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మరోసారి సిఎం వైఎస్ జగన్ పై తీవ్ర ఆరోపణలు చేసారు. ట్విట్టర్ వేదికగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కృష్ణా డెల్టా కు పట్టిసీమ నీళ్ళు రావడంపై ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ విమర్శలు చేసారు. 

 

మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముందుచూపుతో తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టిన  పట్టిసీమ ద్వారా ఆరో సంవత్సరం కూడా కృష్ణాడెల్టా రైతులను కాపాడేందుకు గోదావరి జలాలు వచ్చేసాయని ఆయన పేర్కొన్నారు. వట్టి సీమ, పంపులు పీకుతామన్న మీరు అధికారంలోకి వచ్చి ఏడాది దాటిందని ఆయన పేర్కొంటూ నాటి మీ మాటలకు ప్రజలకి  ఏం సమాధానం చెబుతారు ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ గారూ అంటూ నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: