దేశ వ్యాప్తంగా ఆర్ధిక ఇబ్బందులు ప్రజలను వెంటాడుతూ వేధిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలు ఎవరూ కూడా ఇప్పుడు స్వేచ్చగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసే పరిస్థితి లేదు అనే చెప్పాలి. చేనేత కార్మికులు, చేతి వృత్తుల వారు అయితే ఇప్పుడు చేతిలో రూపాయి ఆడక నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వారిని ఆదుకోవాలని సిఎం జగన్ కి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాసారు. 

 

రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగానికి గత ఏడాదికన్నా ఈ ఏడాది రు.65 కోట్లు తక్కువ కేటాయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. కరోనా లాక్‌డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులకు నెలకు రు.5 వేల చొప్పున 10 నెలల పాటు ఆర్థిక సహాయం అందించాలని సిఎం జగన్ ని రామకృష్ణ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: