దేశ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత ఏ మాత్రం కూడా తగ్గడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని ఎక్కడా తగ్గడం లేదు. గత 24 గంటల్లో భారతదేశంలో 465 మరణాలు సంభవించాయి అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక అత్యధికంగా ఒక్క రోజులో 15968 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. 

 

అంటే దాదాపు 16 వేల కేసులు నమోదు అయ్యాయి. ఇక భారతదేశంలో మొత్తం పాజిటివ కేసుల సంఖ్య 456183గా ఉందని కేంద్రం తెలిపింది. వీటిలో 183022 క్రియాశీల కేసులు ఉన్నాయని... 258685 మందికి కోరనా పూర్తిగా నయం అయిందని వివరించింది. 14476 మంది కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా మరణించారు అని వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: