ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే సంక్షేమ కార్యక్రమాల విషయంలో మాత్రం ఏపీ సర్కార్ ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. ఏడాది లో దాదాపు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తుంది ఏపీ సర్కార్. 

 

ఇక ఇదిలా ఉంటే తాజాగా దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. “ఏడాదిలోనే 90 శాతం హామీలు నెరవేర్చి, ఇంకా చేయాల్సిన పనుల గురించి జగన్ గారు తపన పడుతుంటే, బాబు గ్యాంగ్ హైదరాబాద్ లో తిష్ఠవేసి కుట్రలకు తెగబడ్డారు. రాష్ట్ర శ్రేయస్సు అవసరం లేదు. ప్రజలు సంతోషంగా ఉండొద్దు. సంక్షేమ పాలనను ఎలా అడ్డుకోవాలా అని స్కెచ్చులు వేస్తున్నారు.” అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: