గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కు అంశం ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.
ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతుంది అంటూ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయటం లేదంటూ పిటిషన్లో పేర్కొన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. సీఎస్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, ఏపీ ఎన్నికల కార్యదర్శిని ప్రతివాదులుగా పిటిషన్లో చేర్చారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. నిమ్మగడ్డ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఎన్నికల కమిషనర్గా రమేష్ కుమార్ ను నియమించాలని గతంలో హైకోర్టు ఏపీ ప్రభుత్వం కు ఆదేశించిన విషయం తెలిసిందే.