కాపుల తరుపున సిఎం వైఎస్ జగన్ కి ప్రత్యేక ధన్యవాదాలు అని కాపు కార్పోరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. కాపు నేస్తం ద్వారా రెండు లక్షల 36 వేల మందికి లబ్ది చేకూరిందని అన్నారు. కాపు కార్పోరేషన్ ద్వారా ఏటా వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు అని కాని కాపులకు ఇచ్చిన  హామీలను గాలికి వదిలేసారు అని ఆయన ఆరోపించారు. 

 

కాపుల అభివృద్దికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ప్రతీ ఒక్క కాపు సోదరుడు కి వైసీపీ సర్కార్ న్యాయం చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు హామీలు మినహా చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు. గత ప్రభుత్వం ఏడాదికి రూ 400 కోట్లు కూడా కాపుల కోసం ఖర్చు చేయలేదు అని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: