దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర తో రోజు వారీ కరోనా కేసుల్లో ఢిల్లీ పోటీ పడుతూ వెళ్తుంది. ప్రతీ రోజు వేల కేసులు నమోదు అవుతున్నాయి. కేసులు పెరిగే అవకాశం ఉందని ఢిల్లీ సర్కార్ చెప్పిన విధంగానే భారీగా ప్రతీ రోజు కేసులు నమోదు అవుతున్నాయి. 

 

ఇక తాజాగా మరోసారి దాదాపు 4 వేల కేసులు నమోదు అయ్యాయి ఢిల్లీలో. దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా కేసులు 70 వేల మార్క్ ని దాటాయి అని అక్కడి సర్కార్ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. గత 24 గంటల్లో 3,788 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మొత్తం ఢిల్లీలో మృతుల సంఖ్య 2,365 కి చేరుకుంది. మొత్తం 26,588 క్రియాశీల కేసులు ఉన్నాయి. 41,437 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: