భారత్ చైనా సరిహద్దుల్లో చైనా ఆర్మీ కుక్క బుద్ధి ఇంకా అలాగే ఉంది. ఒక పక్క రెండు దేశాల ఆర్మీ చర్చలు జరుపుతున్నా సరే గాల్వాన్ లోయలో దెబ్బ తిన్న సైనిక పోస్ట్ వద్ద మళ్ళీ నిర్మాణం చేపట్టింది చైనా ఆర్మీ. అదే విధంగా భారీగా బలగాలను చైనా ఆర్మీ మొహరిస్తుంది. ఇక యుద్ద ట్యాంక్ లతో పాటుగా యుద్ద విమానాలు కూడా సరిహద్దులకు చేరుకున్నాయి. 

 

దీనిపై భారత ఆర్మీ ఆగ్రహంగా ఉంది. శాటిలైట్ చిత్రాల్లో దీనికి సంబంధించిన ఆధారాలను స్పష్టంగా గుర్తించింది ఆర్మీ. దీనిపై ఇప్పుడు ఫోటోలను కూడా విడుదల చేసే ఆలోచనలో ఉంది. ఇక దీనిపై అమెరికా కూడా నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. భారీ యుద్ద ట్యాంక్ లు  సరిహద్దుల్లోకి వస్తున్నాయని గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: