ఈ మధ్యకాలంలో దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోవడమే కాదు రికవరి రేట్ కూడా భారీగా పెరిగి పోతుంది అని అంటున్నారు నిపుణులు.
ఇప్పుడు వరకు 2,71,697 మంది కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం దేశంలో రికవరీ రేటు 57.43 శాతానికి పెరిగింది. కేసుల సంఖ్య 39.42 శాతం మరణాలు 3.15 శాతానికి చేరుకున్నాయి . గత కొద్ది రోజుల నుంచి దేశం కరోనా నుంచి కోరుకుంటుందని అంటున్నారు నిపుణులు.