భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితి మరోసారి ఆందోళనకరంగా మారుతుంది. ఒక పక్క చర్చలు జరుగుతున్నా సరే చైనా మాత్రం భారత్ పై తన ప్రతాపం చూపించే విధంగా అడుగులు వేస్తున్న నేపధ్యంలో భారత ఆర్మీ కూడా ఇప్పుడు చైనా విషయంలో అదే స్థాయిలో ఘాటుగా స్పందిస్తుంది. చైనా సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించింది భారత ఆర్మీ. 

 

దాదాపు 10 వేల మందికి పైగా అదనపు బలగాలను సరిహద్దులకు తరలించే ఆలోచనలో భారత ఆర్మీ ఉన్నట్టు తెలుస్తుంది. సైనికులకు అత్యాధునిక ఆయుధాలను అందించి సరిహద్దులకు పంపే ఆలోచన కేంద్రం చేస్తుంది అని తెలుస్తుంది. చైనా కూడా అదే స్థాయిలో బలగాలను సరిహద్దుల్లో మోహరించడం తో ఎప్పుడు ఏం జరుగుతుందా ఆనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: