హైదరాబాద్ లో కరోనా పేరు చెప్తే చాలు... ఆస్పత్రులు భయపడుతున్నాయి. ఎక్కడో ఒక ఆస్పత్రిలో రోజు కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. రోజు రోజుకి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా కేసులు మాత్రం ఆగడం లేదు.  ప్రధాన ఆస్పత్రుల్లో కరోనా కేసులు బయటపడటం ఇప్పుడు కంగారు పెడుతుంది ప్రభుత్వాన్ని కూడా. 

 

ఇక తాజాగా హైదరాబాద్ లోని చెష్ట్ ఆస్పత్రిలో హెడ్ నర్సు కరోనా కారణంగా మరణించారు. కరోనా బారిన పడిన హెడ్ నర్సు గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 30 న ఆమె పదవీ విరమణ చెయ్యాల్సి ఉంది. 20 రోజుల ముందు వరకు ఆమె కరోనా విదుల్లోనే ఉన్నారు. ఆమె భర్త కూడా కరోనా బారిన పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: