రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో తెలంగాణాలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో  భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. 

 

ఇక రాయలసీమలో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అని పేర్కొంది. రాబోయే పది రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ వెల్లడించింది. దాని ప్రభావం ఆంధ్రా తెలంగాణా, ఓడిశా రాష్ట్రాల మీద ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: