పౌర హక్కుల నేత వరవరరావుకి ముంబై  కోర్ట్ షాక్ ఇచ్చింది. ఆయన బెయిల్ పిటీషన్ ని కోర్ట్ తిరస్కరించింది. అనారోగ్యంతో ఉన్నా అని తనకు బెయిల్ ఇవ్వాలి అని ఆయన ముంబై కోర్ట్ లో పిటీషన్ వేసారు. అయితే ఆయన బెయిల్ పిటీషన్ ని ముంబై కోర్ట్ తిరస్కరించాలి అని అతనికి బెయిల్ ఇవ్వొద్దు అని ఎన్ఐఏ కోరింది. 

 

మహారాష్ట్రలోని బీమా కారేగావ్ ఘటనలో ఆయన ప్రధాన నిందితుడు అని ఎన్ఐఏ పేర్కొంది. ఈ మేరకు ఎన్ఐఏ తరుపు లాయర్ వాదనలను వినిపించడంతో కోర్ట్ వాటితో ఏకీభవించి బెయిల్ ని రద్దు చేసింది. ఇక ఇదిలా ఉంటే ఆయనకు బెయిల్ ఇప్పించి తీసుకుని రావాలని.... తెలంగాణా రచయితల సంఘం సిఎం కేసీఆర్ కి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: