8 కోట్లకు పైగా కుటుంబాలకు పొగ లేని వంట గదులు అందుబాటులో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇల్లు లేని వాళ్లకు దేశంలో 1.5 కోట్లకు పైగా ఇళ్ళు  నిర్మించామని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం ఆయుష్మాన్ భారత్ అని ప్రధాని మోడీ అన్నారు. 

 

కరోనా గురించి మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రారంభంలో, భారతదేశంలో వైరస్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని కొంతమంది ఊహించారని ఆయన అన్నారు. లాక్డౌన్, ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాలు మరియు ప్రజలు నడిపిస్తున్న పోరాటం కారణంగా, కరోనా పోరాటంలో భారతదేశం అనేక ఇతర దేశాల కంటే మెరుగైన స్థానంలో ఉందని అన్నారు. భారతదేశం రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: