కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన గ్యాస్ లీక్ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఎస్పీ వై రెడ్డి ఫ్యాక్టరీలో విషవాయువు లీక్ కావడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఫ్యాక్టరీ లో ఉన్న కార్మికులను బయటకు పంపిస్తున్నారు అధికారులు. 

 

అగ్నిమాపక సిబ్బందితో పాటుగా వైద్య బృందం కూడా అక్కడికి చేరుకుంది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది బాధితులను వేగంగా నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తో నంద్యాలలో ఒక్కసారిగా అలజడి రేగింది. అమ్మోనియం గ్యాస్ లీక్ కావడంతోనే ఈ ఘటన జరిగింది అని భావిస్తున్నారు. స్థానికులు ఇల్లు ఖాళీ చేసి దూరంగా వెళ్ళిపోతున్నారు. గ్యాస్ తీవ్రత అంతగా లేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: