చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకోవడం కామన్ గా మారిపోయిన విషయం తెలిసిందే. బిర్యానీ పెట్టిన చిచ్చు ఏకంగా ఒక ప్రాణాన్ని బలితీసుకుంది. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలో  మనోహరర్  శరణ్య దంపతులు మద్య  బిర్యాని చిచ్చు పెట్టింది. 

 

 తనకు బిర్యానీ తినాలని కోరిక గా ఉంది అంటూ భార్య భర్తను కోరడంతో... ఆర్థిక ఇబ్బందుల కారణంగా తేలేక పోయాడు. దీంతో మనస్తాపానికి గురైన శరణ్య మనోహర్ పై  అలిగింది. తర్వాత  ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్... భర్త బయటకు వెళ్ళగానే భర్థ  బండిలో పెట్రోల్ తీసి ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: