హైదరాబాద్ లో  కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో సిఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. హైదరాబాద్ లో లాక్ డౌన్ విధించే దిశగా సిఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ విధించే ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తుంది. 

 

మూడు నాలుగు రోజుల్లో విధి విధానాలు రూపొందించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రతిపాదనలను సిద్దం చెయ్యాలి అని అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. కేసులు ప్రతీ రోజు కూడా భారీగా నమోదు అవుతున్నాయి. ఇక మూడు నాలుగు రోజుల్లో తెలంగాణా కేబినేట్ సమావేశం కానుంది అని ఆయన చెప్పారు. పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ ఈ సందర్భంగా వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: