తెలంగాణా పోలీసు అకాడమీలో కరోనా భయం వెంటాడుతుంది. అక్కడ 124 మంది అభ్యర్ధులకు కరోనా సోకింది. వంట మనిషికి ముందు కరోనా సోకగా అక్కడి నుంచి మిగిలిన వారికి కరోనా సోకింది. దీనితో ఇప్పుడు ఆందోళన వ్యక్తం అవుతుంది. ఉన్నతాధికారులకు కూడా కరోనా సోకే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. 

 

దీనితో కాస్త జాగ్రత్త పడుతున్నారు అధికారులు. మొత్తం సిబ్బంది అందరిని అభ్యర్ధులు అందరిని క్వారంటైన్ కి తరలించారు. ఇంకెంత మందికి కరోనా సోకిందో అనే అనుమానం తో ఇప్పుడు పరిక్షలు అందరికి చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఇక హైదరాబాద్ లో పరిస్థితి మరీ  భయంకరంగా ఉంది. అక్కడ ప్రతీ రోజు వందల కేసులు నమోదు అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: