తెలంగాణాలో ఇప్పుడు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు వందల్లో నమోదు అయిన కేసులు ఇప్పుడు వేలకు చేరుకున్నాయి. నిన్న ఒక్క రోజే 1087 కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక కేసులు పెరుగుతున్న నేపధ్యంలో హైదరాబాద్ లో  ఇప్పుడు మెడికల్ షాపు యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 

 

హైదరాబాద్ లో మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు భేటి అయ్యారు. మెడికల్ షాపుల్లో పని చేస్తున్న సిబ్బందికి కరోనా సోకుతున్న నేపధ్యంలో జూలై 15 వరకు రాత్రి 7 గంటల వరకే మెడికల్ షాపులు అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. ఇంతకు మించి తమ వద్ద మరో మార్గం లేదు అని అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని మెడికల్ షాపు యజమానులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: