హైదరాబాద్ లోని ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. జవహర్‌నగర్‌ బీజేఆర్‌నగర్‌కు ఓ వ్యక్తి కరోనాతో చెస్ట్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. అయితే అతనికి వైద్యులు వెంటిలేటర్ తీసి వేసారు. ఎంత బ్రతిమిలాడినా సరే అతనికి మాత్రం వెంటిలేటర్ పెట్టలేదు. 

 

ఊపిరి ఆడటం లేదని కోరినా సరే వైద్యులు కనికరించలేదు. ఇతర సిబ్బంది కూడా అతని వైపు చూడలేదు. ఇప్పుడు ఈ వీడియో సంచలనంగా మారింది.  చనిపోయే ముందు సేల్ఫీ వీడియో రికార్డ్ చేసి తన తండ్రికి పంపించాడు. బాయ్ డాడీ, నేను చనిపోతున్నా అంటూ మూడు గంటలు ఇబ్బంది పడి అతను ప్రాణాలు కోల్పోయాడు. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: