దేశం ఇప్పుడు రెండు యుద్దాలు చేయడానికి సిద్దమైంది అని హోం శాఖా మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన మాట్లాడుతూ నేడు కీలక  వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం మన దేశం రెండు ప్రధాన సమస్యల్ని ఎదుర్కుంటోందని అన్నారు. ఒకటి చైనా నుంచి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ కాగా మరొకటి గాల్వన్ లోయలో చైనా సైనికులు సృష్టించిన ఘర్షణ అని ఆయన పేర్కొన్నారు. 

 

అయితే ఈ రెండు యుద్ధాల్లోనూ భారత్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో వాటిపై పోరాటం చేసి విజయం సాధిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇక చైనా సరిహద్దుల్లో బలగాలను మొహరిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: