పెట్రోల్ ధరల పెంపుపై రాష్ట్రపతికి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై పెట్రోల్ ధరల పెంపు మరింత భారాన్ని పెంచుతుంది అని లేఖలో పేర్కొన్నారు. ఎంతో మంది కార్మికులు ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని... ఇలాంటి సమయంలో పెట్రోల్ ధరలు తగ్గించి ప్రజలకు ఊరట ఇవ్వాలని కోరారు.
కరోనా సంక్షోభంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తోందని అంటూ పలు విమర్శలు కూడా చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగడం విచిత్రంగా ఉంది అని తెలిపారు.