ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా కేసులు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. అక్కడ కాస్త కఠినం గా వ్యవహరించడం, లాక్ డౌన్ విషయంలో ప్రభుత్వం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో అక్కడ కరోనా కేసులు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. ఇక ఇదిలా ఉంటే... తాజాగా మిజోరాం లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 

 

జూన్ 29 న మిజోరంలో కొత్త కరోనా పాజిటివ్ కేసు ఏదీ నమోదు కాలేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.  రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 151 గా ఉందని పేర్కొంది. 61 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని పేర్కొన్నారు. యాక్టివ్ కేసులు 90 అని సమాచార మరియు ప్రజా సంబంధాల విభాగం వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: