ఆంధ్రప్రదేశ్ లో నాడు నేడు ద్వారా వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కూడా ఆస్పత్రులను వైద్య సదుపాయాలను ఏపీ సర్కార్ సరికొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దీనిపై ప్రజల్లో కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పేదవాడికి కావాల్సిన వాటిలో ప్రధానంగా... ఉండేది ఆరోగ్యం. 

 

ఇప్పుడు దాని విషయంలోనే సిఎం జగన్ దూకుడుగా వెళ్తున్నారు. దీనిపై విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. రాష్ట్రంలో సర్కారీ వైద్య విప్లవాన్ని తీసుకొచ్చారు జగన్ గారు. తొలిసారిగా 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు. దివంగత నేత జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. తర్వాత సీఎంలు ప్రైవేటును మాత్రమే ప్రోత్సహించారు. పెద్దాయన కలలన్నింటినీ జగన్ గారు సాకారం చేస్తున్నారన్నారు విజయసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: