గాల్వాన్ వ్యాలీలో చైనా ఆర్మీ భారత ఆర్మీ మీద చేసిన దాడి తీవ్ర స్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. భారత అర్మీని లక్ష్యంగా చేసుకుని చైనా బలగాలు దాడి చేయడంపై సర్వత్రా కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ దాడిని ప్రపంచ దేశాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడి సరైన విధానం కాదని అమెరికా సహా పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. 

 

తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్రెంచ్ మంత్రి భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ కు లేఖ రాసారు. గల్వాన్ వ్యాలీలో ఇరవై మంది భారతీయ సైనికులు మరణించడాన్ని ఖండిస్తూ ఫ్రెంచ్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ నిన్న లేఖ రాసారు. కాగా చైనా దాడిలో వంద మంది సైనికులు గాయపడిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: