కేసులు  పెరుగుతున్న సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మాస్క్ ఎవరు అయినా సరే ధరించాలని ఆయన స్పష్టం చేసారు. కరోనా నిబంధనలు అందరూ పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. పబ్లిక్ ప్లేస్ లో మాస్ చాలా అవసరం అని అయన స్పష్టం చేసారు. 

 

పేదల ఖాతాలో 31 వేల కోట్లు జమ చేసామని మోడీ వివరించారు. కంటైన్మెంట్ జోన్లపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిందే అని ఆయన స్పష్టం చేసారు. పేదలకు లక్షా 75 వేల కోట్లు కేటాయించామని ఆయన వివరించారు. గరీబ్ కళ్యాణ్ కింద 50 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసామని ఆయన వివరించారు. సరైన సమయంలో లాక్ డౌన్ విధించారని మోడీ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: