దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత చాలా అధికంగా ఉంది కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం కట్టడి అయ్యే పరిస్థితి కనపడటం లేదు. ఇక ఇదిలా ఉంటే అక్కడ  కరోనా ఇప్పుడు పోలీసు అధికారులకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా ఒక పోలీసు అధికారి కరోనా బారిన‌ప‌డిన‌ ప్రాణాలు కోల్పోయారు. 

 

ఢిల్లీ పోలీస్‌ స్పెషల్ సెల్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ సంజీవ్ కుమార్ యాదవ్  ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆయనకు గత 14 రోజులుగా సాకేత్‌లోని మాక్స్ ఆసుప‌త్రిలో  చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఆయనకు ప్లాస్మా చికిత్స చేసినా సరే... ఆయన ప్రాణాలు నిలబడలేదు. రెండు సార్లు ఆయనకు ప్లాస్మా చికిత్స చేసినా సరే పోలీసు అధికారి బ్రతకలేదు అని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: