ఏపీ వైద్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వస్తామని సిఎం వైఎస్ జగన్ అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆంకాలజీ విభాగం  ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆస్పత్రుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే విధంగా మార్పులు మొదలు పెట్టామని ఆయన అన్నారు. 

 

యుకే తరహాలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వస్తామని ఆయన చెప్పారు.  యుకె లో గ్రామాల స్థాయిలో వైద్యం అందుతుంది అని ఇక్కడ కూడా అదే విధంగా అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. అంబులెన్స్ లో ఉన్న వీడియో కెమెరాల ద్వారా ఈఆర్సీలో వైద్యులు పరిస్థితిని పర్యవేక్షిస్తారు అని సిఎం అన్నారు. నెట్ వర్క్ ఆస్పత్రులకు పూర్తిగా బకాయిలు చెల్లించామని సిఎం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: