ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలను కరోనా వైరస్ భయపెడుతుంది.  అధికార పార్టీ  ఎమ్మెల్యేలు ముగ్గురు కరోనా బారిన పడ్డారు.  కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే, విజయనగరం జిల్లా ఎస్ కోట ఎమ్మెల్యే కి కరోనా సోకగా తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. 

 

అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనకు కరోనా పరిక్షలు చేయగా కరోనా సోకినట్టు వెల్లడి అయింది. ఆయన గన్ మెన్ సహా... డ్రైవర్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఆయనకు ఏ విధంగా కరోనా సోకింది అనే దానిపై స్పష్టత లేదు. ఆయన హోం ఐసోలేషన్ లోనే ఉంటున్నారు అని ఇంటి నుంచే వైద్యం తీసుకుంటున్నారు అని అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: