తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న వేల టెస్టుల విషయంలో తెలంగాణ సర్కార్ పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే, ఇటీవలే ప్రైవేట్ ల్యాబ్ లకు కూడా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే తాజాగా ప్రైవేట్ ల్యాబ్ లో కరోనా టెస్టులకు మరోసారి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. నాలుగు రోజులపాటు ప్రైవేట్ ల్యాబ్ లో కరోనా వైరస్ పరీక్షలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం ప్రైవేట్ ల్యాబ్ లన్నింటిని సానిటైజేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ టెస్ట్ లను ప్రారంభిస్తామని తెలంగాణ సర్కార్ చెప్పింది.
Powered by Froala Editor