ఒక పక్క తమ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా సరే పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారడం లేదు. భారత్ పై సరిహద్దుల్లో వరుసగా దాడులు చేస్తుంది. తాజాగా మరోసారి సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి కాల్పులకు దిగింది.

 

జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలోని షాపూర్, కిర్ని సెక్టార్ లో పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది అని భారత ఆర్మీ పేర్కొంది.  ఈ రోజు ఉదయం సుమారు 09: 30 గంటలకు ఉల్లంఘించిందని, భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంటోందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఇక ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు అని తెలుస్తుంది. భారత అర్మీని లక్ష్యంగా చేసుకుని వరుసగా కాల్పులకు దిగుతుంది ఇటీవలి కాలంలో.

మరింత సమాచారం తెలుసుకోండి: