ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకి కరోన కేసులు ఇప్పుడు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఇక ప్రభుత్వ వర్గాల్లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో 10  మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. 

 

అలాగే ఏపీ అసెంబ్లీలో మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. ఏపీ అసెంబ్లీ సచివాలయాల్లో మొత్తం 27 మందికి కరోనా వచ్చింది అని ఏపీ  వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. దీనితో మంత్రులు కూడా అప్రమత్తం అవుతున్నారు. సచివాలయంకు వెళ్ళడం కూడా కొందరు మంత్రులు మానేశారు. ఇక కీలక శాఖల్లో  పని చేసే ఉద్యోగులు అందరూ కూడా జాగ్రత్తలు పడుతున్నారు. కొంత మంది విధులకు కూడా హాజరు కావడం లేదు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: