ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ద్రవ్య వినిమయ బిల్లుని అడ్డుకోవడంపై ఇప్పుడు వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. మండలిలో బలం ఉందని ఆ పార్టీ అడ్డుకుంది అని అది కరెక్ట్ కాదు అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ కి ఘాటు సమాధానం ఇచ్చారు.
ద్రవ్య వినిమయ బిల్ ను మండలిలో అడ్డుకుని... ఉద్యోగులను వేధిస్తున్నాడు చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. ప్రజలు బుద్ది చెప్పినా తన వక్రబుద్ధి మార్చుకోలేదని మండిపడ్డారు. ప్రజలపైన కక్ష సాధిస్తున్నాడు. మండలి ఆమోదం అవసరం లేదన్నారు. చంద్రబాబు మోకాలు అడ్డాడు అంతే అని.. ఇంకో మూడు రోజుల్లో సమస్య తొలగిపోతుందని పేర్కొన్నారు.
ద్రవ్య వినిమయ బిల్ ను మండలిలో అడ్డుకుని... ఉద్యోగులను వేధిస్తున్నాడు చంద్రబాబు. ప్రజలు బుద్ది చెప్పినా తన వక్రబుద్ధి మార్చుకోలేదు, ప్రజలపైన కక్ష సాధిస్తున్నాడు. మండలి ఆమోదం అవసరం లేదు - చంద్రబాబు మోకాలు అడ్డాడు అంతే. ఇంకో మూడు రోజుల్లో సమస్య తొలగిపోతుంది.
— Vijayasai reddy v (@VSReddy_MP) July 2, 2020