మాస్క్ ధరించాలి అని ఎంత మంది ఎన్ని విధాలుగా చెప్తున్నా సరే సమాజం లో కొందరి వైఖరి లో మాత్రం మార్పు అనేది రావడం లేదు. కరోనా ధరించాలి అని చెప్తున్నా సరే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇక ప్రభుత్వాలు కూడా దీనిపై కాస్త సీరియస్ గానే ఉన్నాయి. తాజాగా కర్ణాటక పోలీసులు మాస్క్ లేని వారికి చుక్కలు చూపించారు. 

 

జూన్ నెలలో ముసుగులు ధరించకపోవడం మరియు సామాజిక దూరాన్ని కొనసాగించనందుకు రూ .57.39 లక్షల జరిమానా వసూలు చేశామని కర్ణాటకలోని బ్రూహత్ బెంగళూరు మహానగర పాలికే (బిబిఎంపి) ప్రకటించింది. ఇక మాస్క్ లు ధరించని వారిపై కచ్చితంగా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేసింది. దానికి ఎవరూ అతీతులు కాదని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: