టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్దలనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అని ఏపీ ప్రభుత్వ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన  చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు. చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్ లకు మాత్రమే పరిమితం అయ్యారు అని ఆయన పేర్కొన్నారు. 

 

నిబద్దత విశ్వసనీయత కలిగిన నాయకుడు కాబట్టే సిఎం జగన్ కు ప్రజలు పట్టం కట్టారు అని ఆయన అన్నారు. మతిమరుపు ప్రజలకు కాదు చంద్రబాబుకి అంటూ సజ్జల వ్యాఖ్యానించారు.  అందుకే చంద్రబాబుకి ప్రజలు ఛీ కొట్టారు అని ఆయన పేర్కొన్నారు. చెప్పిన అబద్దాలే పదే పదే చెప్తారు అని ప్రజలు నమ్ముతారు అని భావించి ఆయన అబద్దాలు చెప్తున్నారు అని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: